డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో NSS యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం "వాల్మీకి మహర్షి జయంతి" కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల సమర్పించి వారి యొక్క జీవిత విశేషాలను,వారు రామాయణ కావ్యాన్ని రచించిన తీరును, రామాయణం యొక్క గొప్పతనాన్ని,అందులోని కాండాలను గురించి విద్యార్థినులకు వివరించడం జరిగింది.
కార్యక్రమంలో కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ M. మురళీ,NSS ప్రోగ్రాం ఆఫీసర్ మడుపు నవీన్ రెడ్డి, లెక్చరర్స్ సీతారాము, శ్రీనివాస్,ప్రవీణ్ కుమార్, జబీఉల్లా,సునీత, అఫ్రొజ్ సుల్తానా,అనిత, భూపాల్ ఆఫీస్ సిబ్బంది స్వప్న,సౌజన్య,ప్రకాశ్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.