డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గం,కేంద్రంలో ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువ నాయకులు లింగారెడ్డిగూడ అశోక్,అక్కిగారి శ్రీధర్ ,దంగు శ్రీనివాస్ యాదవ్ ,మాజీ కౌన్సిలర్ విజయ కుమార్ రెడ్డి, అందె మోహన్ కలుసుకొని ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల నియోజకవర్గం పర్యటనలో సుమారు 150 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి నియోజకవర్గం అభివృద్ధిలో ప్రత్యేక గుర్తు వేసిన ముఖ్యమంత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినట్లు వారు తెలిపారు.
News
సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు వెల్లువ