Posted on 2024-09-13 10:54:02
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదం మోపుతాం
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ మహానగరం తోపాటు తెలంగాణ నలుదిక్కులు అభివృద్ధి చెందేలా ట్రిబుల్ ఆర్, ఫోర్త్ సిటీ, విద్య-వైద్య రంగాలు లాంటి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
అధికారం కోల్పోయామనే అక్కసుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కేఎల్ఆర్ మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
వ్యక్తిగత దూషణలు చేసుకుని బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని... వాటిని ఏమాత్రం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సహించబోదని హెచ్చరించారు.
బిఆర్ఎస్ పాలనలాగా నిర్బంధాలు చేస్తే ప్రతిపక్ష నాయకులు రోడ్లపై తిరగలేరని కాంగ్రెస్ నేత గుర్తు చేశారు.
ప్రజా సమస్యలపై విలువైన సూచనలు ఇస్తే అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే ఇంత వరకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రాలేదన్నారు కేఎల్ఆర్.
ఫామ్ హౌస్ ఆదేశాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు బలికావొద్దన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారు హెచ్చరించారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >