Posted on 2024-09-07 08:19:56
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ బాలుడిని ఓ దొంగ దారుణంగా హత్యచేశాడు. దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తిని చూసిన బాలుడు ఎక్కడ అరిచి ఇంట్లో వాళ్లను పిలుస్తాడేమో అన్న భయంతో బాలుడిని బలంగా నేలకేసి కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కుమారుడు కట్టప్ప (6) ఉన్నాడు. అయితే, బాలుడి తండ్రి దుర్గయ్య స్థానికంగా పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎల్లయ్య అనే వ్యక్తి ఆ పందులను దొంగిలించేందుకు దుర్గయ్య ఇంటి వద్దకు వచ్చాడు. అది బాలుడు కట్టప్ప గమనించాడు. అయితే, బాలుడు తనను ఎక్కడ పట్టిస్తాడో అన్న భయంతో ఎల్లయ్య కట్టప్పను నేలకేసి కొట్టి దారుణంగా హత్యచేశాడు. తలకు బలమైన గాయం కావడంతో బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >