| Daily భారత్
Logo




ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

News

Posted on 2024-07-23 13:54:18

Share: Share


ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

డైలీ భారత్, హనుమకొండ: ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు  మెరుగైన వైద్య సేవలను వైద్యులు సిబ్బంది అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశించారు.

మంగళవారం హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల  గదులతోపాటు  ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన  పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని  కలెక్టర్ ఆరా తీశారు. ఏవైనా  సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమీకృత సలహా పరీక్ష(ఐసీటీసీ) కేంద్రాన్ని, అదేవిధంగా ఆసుపత్రిలోని హెచ్ఐవి టెస్ట్  సెంటర్ను  కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని  ఐపి, ఓపీ సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందించాలన్నారు. ఆసుపత్రిలో ఏవైన ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించే వివిధ జబ్బులకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ఆటోమెటిక్ గా జనరేటర్ లు పనిచేసేటట్టు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Posted On 2026-07-17 14:04:31

Readmore >
Image 1

నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

Posted On 2026-07-17 13:51:23

Readmore >
Image 1

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నీ కలిసిన సర్పంచ్

Posted On 2026-07-17 13:48:52

Readmore >
Image 1

పూరీ జగన్నాథ రథయాత్ర

Posted On 2026-07-16 05:34:18

Readmore >
Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >