Posted on 2024-07-21 13:35:54
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక శ్రీ దాశరధి కృష్ణమాచార్య అవార్డు 2024 సంవత్సరానికి గాను ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, కోశాధికారి పర్కాల రవీందర్,తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడేపు లక్మన్ జిల్లా అధ్యక్షులు వెంగలి నాగరాజు...
వారు మాట్లాడుతూ... సాహితీ ప్రపంచానికి ఎనలేని సేవ చేస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ సామాన్యుల జీవితాలే ఇతివృత్తాలుగా అనేక రచనలు చేసిన అభ్యుదయ కవి, రచయిత జూకంటి అని అన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించడం గర్వకారణమని అన్నారు.
జూకంటి విశేషాలు....
జూకంటి జగన్నాథం తెలంగాణకు చెందిన వచన కవి, కథకులు. 14 కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం వెలువరించారు.
జననం 1955 జూన్ 20 (వయసు 69)
తంగళ్లపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లా , తెలంగాణ,
జగన్నాథం 1955, జూన్ 20న దుర్గయ్య-సుశీల దంపతులకు రాజన్న సిరిసిల్లా జిల్లా లోని తంగళ్లపల్లి గ్రామంలో జన్మించారు.
రచనారంగం: జగన్నాథం ప్రధానంగా వచన కవిత్వం రాస్తారు. కథల సంకలనం కూడా వచ్చింది. వీరి కవిత్వంపై యం. నారాయణ శర్మ విశ్లేషణ చేసి ఊరి దుఃఖంపేరుతో ఒక వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించారు. అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, మైనార్టీ వాదాల కవిత్వం రాశారు. ప్రధానంగా ప్రపంచీకరణ పరిణామాలను మొదటగా తెలుగు సాహిత్యంలో రాసిన కవిగా గుర్తింపు పొందారు.
వచన కవిత్వ సంకలనాలు: పాతాళ గరిగె (1993), ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (1996), గంగడోలు (1998), వాస్కోడిగామా డాట్ కామ్ (2000), బొడ్డుతాడు (2002), ఒకరోజు పదిగాయాలు (అత్యాధునిక కావ్యం) 2004,తల్లికొంగు (2006),
పిడికెడు కలలు! దోసెడు కన్నీళ్లు! (2008),తారంగం (2009), రాజపత్రం (2011), చిలుక రహస్యం (2012), చెట్టును దాటుకుంటూ.... (2015),వస (2017), ఊరు ఒక నారుమడి (2018),సద్దిముల్లె (2020).
కథా సంకలనం:-
వైపణి (2004)
అవార్డులు:
వలస (కథ) ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి (1986)
సినారె కవితా పురస్కారం (1998)
నూతన పాటి గంగాధరం పురస్కారం (2000)
ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
గరికపాటి పురస్కారం (2004)
సృజనాత్మకత ప్రక్రియలకు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి అవార్డు (2002)
రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం (2008)
కవిత్వం విభాగంలో తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం (2011)
తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం (2015)
తెలంగాణ సారస్వత పరిషత్తు సినారె పురస్కారం (2019)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్దుబిడ్డ
అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం (2024) అందుకోబోతున్న
జూకంటి జగన్నాథం కి శుభాకాంక్షలు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >