Posted on 2024-07-21 12:19:53
షాద్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ఆధ్యాత్మిక సేవలో తరించాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రతి ఒక్కరూ సమాజంలో ఆధ్యాత్మిక సేవలతో తరించాలని తద్వారా పుణ్యం, పురుషార్ధం లభిస్తాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు. ఈ సందర్భంగా గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిరు పేద వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలతో పాటు చీరల పంపిణీ నిరంతరం చేపడుతున్నారని ఎంతో గొప్ప విషయం అని అందరికీ స్ఫూర్తిగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ ప్రధాన కార్యదర్శి సమాధానం సుధాకర్ తదితరుల సేవలను ఎమ్మెల్యే శంకర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయ అధ్యక్షుడు విజయ్ కుమార్, లయన్ కమ్మదనం సుధాకర్, మాజీ కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, మహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, శ్రీశైలం, సాయి వంశీ, మాజీస ఉప సర్పంచ్ సీతారాం, భగవాన్ దాస్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >