| Daily భారత్
Logo




ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

News

Posted on 2024-07-20 21:48:36

Share: Share


ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

డైలీ భారత్, జగిత్యాల: ప్రజల సౌకర్యార్ధం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ప్రారంభించారు, ఈ సందర్భంగా మున్సిపల్ పట్టణాలతో పాటు, అన్ని మండల కేంద్రాల లోని ఎం.పీ.డీ.ఓ. కార్యాలయాలలో ప్రజా పాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. 

వివిధ పనుల నిమిత్తం, సమస్యలు విన్నవిస్తూ అర్జీలు సమర్పించేందుకు అనునిత్యం ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్)కు వచ్చే వారికి సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల లోని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందలేక పోతున్న అర్హులైన దరఖాస్తుదారులు, ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేయించుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లోని సేవా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్.పీ.జీ కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్ తమ వెంట తీసుకురావాలని సూచించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, కలెక్టరేట్ ఏవో డిపిఓ వివిధ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు

Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >