Posted on 2024-07-11 11:49:08
షాద్ నగర్ ప్రజలకు పాదాభివందనాలు
మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ
షాద్ నగర్ లో బిజేపి కృతజ్ఞత సభ
పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పాలమూరు ప్రజలు, షాద్ నగర్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు అభిమానులు అన్ని వర్గాలు అందించిన విజయాన్ని నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నానని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీతోపాటు స్థానిక కుంట రామిరెడ్డి గార్డెన్ లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాలు ఇతర వర్గాలను డీకే అరుణ ఘనంగా సన్మానించారు. తన గెలుపు కారణమైన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు డీకే అరుణను ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించడానికి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశారని ఎన్నో బెదిరింపులు మరెన్నో అవమానాలు చేశారని అయినప్పటికీ పాలమూరు ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. తన ఓటమి కోసం రేవంత్ రెడ్డి తదితరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు తన వెన్నంటే ఉన్నారని ఆమె అన్నారు. పాలమూరు జిల్లా సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలలో అన్నింటిని బిజెపి తరఫున లేవనెత్తిన అంశాలేనని ఇప్పుడు తన పోరాటం ద్వారా జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలు ప్రజలు విశ్వసించలేదని కేంద్రంలో మోడీని పాలమూరులో డీకే అరుణమ్మను గుండెల్లో పెట్టుకొని అభిమానించారని ఓట్లు వేశారని అందుకే బిజెపి విజయం సాధ్యమైందని ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మహబూబ్ నగర్, షాద్ నగర్ ప్రాంతాలకు నీరు అందే దాఖలాలు కనిపించడం లేదని అందుకే జూరాల ద్వారా నిరందించే అందించే మరో లిఫ్ట్ ఇరిగేషన్ సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందూ విద్వేషియని అన్నారు. పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసి హిందువులపై అక్కసు వెళ్లగక్కారని అన్నారు. అదేవిధంగా మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాదిరిగా ఏ కంపెనీ వద్ద వసూళ్లకు పాల్పడడం లేదని నియోజకవర్గంలో ఒక పార్లమెంటు సభ్యురాలుగా మాకు అండగా నిలబడి యువతకు ఉపాధి మార్గాలు చూపించాలని పేర్కొన్నారు.
కార్యవర్గ సభ్యుడు అందే బాబయ్య మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయంతో స్థానిక ఎన్నికల్లో బిజెపి కార్యకర్తల గెలుపు కోసం డీకే అరుణమ్మ కృషి చేయాలని సభలో కోరారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అపూర్వ విజయం సాధించి పెట్టిన ఓటర్లకు బిజెపి పార్టీ తరఫున రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలను డీకే అరుణ సత్కరించగా ఆమెను పలువురు నాయకులు ఘనంగా సత్కరించారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితర అభిమానులు డీకే అరుణ చిత్రపటాన్ని బహుమానంగా అందజేశారు..
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >