ములుగు జిల్లాలో అడవికి అంటుకున్న కార్చిచ్చు: వందల ఎకరాల్లో అడవి దగ్ధం
డైలీ భారత్, ములుగు:ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతం లో కార్చిచ్చురగులుకుంది. ఆదివారం ఉదయం సంభ వించిన అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతున్నది.
ప్రాణ భయంతో వన్య ప్రాణులు పరుగులు తీశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
భారీగా పొగ మంచు కమ్ము కోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...