Posted on 2024-03-22 13:15:57
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అనంత నగర్ కు చెందిన మహిళను అత్యాచారం చేసి హత్య చేశారు అని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు ఇంటి యజమాని నుండి పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు స్థానికంగా కూలీ చేసుకుంటూ అనంత నగర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు 15 రోజుల క్రితం నలుగురు కార్మికులు తమ స్వస్థలానికి వెళ్ళగా మరో ఇద్దరు కార్మికులు ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఆ ఇంటి నుండి దుర్గంధం రావడంతో స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకొని ఇంటి తాళం పగల కొట్టి చూడగా గదిలో రక్తపు మడుగులలో ఓ మహిళ మృత దేహం కనిపించింది. మృత దేహాన్ని పోలీసులు పరిశీలించగా తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేసినట్టు గుర్తించారు కాగా గదిలో మద్యం సీసాలు ఉండడంతో మద్యం మత్తులో కార్మికులు మహిళపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కార్మికులు పరారీలో ఉన్నారు చనిపోయిన మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >