Posted on 2026-08-18 15:37:03
డైలీ భారత్, కామారెడ్డి:బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను సదాశివనగర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చుక్క సాయి గౌడ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న పాలకుల అణచివేతను ఎదిరించి గెరిల్లా సైన్యాన్ని నిర్మించి సుమారు 21 కోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
దక్షిణ భారతదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి స్వాతంత్ర్య సమరయోధులకు సర్వాయి పాపన్న చరిత్ర గొప్ప స్ఫూర్తినిచ్చిందని, బ్రిటిష్ పాలకులపై పోరాడేందుకు ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#DailyBharat #KamareddyNews #Sadashivnagar #SarvaiPapannaJayanthi
పిఠాపురం AE కుటుంబం గల్లంతు... అల్లుడి హత్య నుంచి కోడలి లేఖ వరకు సాదిక్ పాత్రపై పోలీసుల ఫోకస్
Posted On 2026-08-19 10:10:39
Readmore >
వేములవాడలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన "బాసింగా బలాలు" సింగర్ ఈశ్వర్ సాయి...
Posted On 2026-08-19 08:47:31
Readmore >
కామారెడ్డి విద్యా చరిత్రలో మరో అడుగు... రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్
Posted On 2026-08-19 07:49:30
Readmore >
పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన ముదిరాజ్ సంఘం నాయకులు
Posted On 2026-08-18 18:31:15
Readmore >
బైక్ దొంగల ముఠా అరెస్ట్ – ఇద్దరు నిందితులు రిమాండ్కు తరలింపు
Posted On 2026-08-18 18:30:02
Readmore >
మొఘల్ దౌర్జన్యాలపై పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తి సదా చిరస్మరణీయం... సాయి గౌడ్
Posted On 2026-08-18 15:37:03
Readmore >