| Daily భారత్
Logo




నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

News

Posted on 2026-06-20 04:25:27

Share: Share


నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

2.8 కిలోల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, టయోటా ఇన్నోవా కారును స్వాధీనం...

బంగారు దండలు దొరికాయంటూ నకిలీ బంగారాన్ని చూపించి అమాయక ప్రజలను మోసం చేసి, కత్తులతో బెదిరించి నగదు దోచుకుంటున్న ముఠా.

డైలీ భారత్, మదనపల్లి: నకిలీ బంగారు పూసల దండను అసలు బంగారంగా చూపించి అమాయక ప్రజలను మోసం చేసి నగదు దోచుకుంటున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లె టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ పావని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 కిలోల 800 గ్రాముల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, ఒక టయోటా ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం, నిందితులు భూమిలో జేసీబీ పనుల సమయంలో బంగారం దొరికిందని నమ్మబలికి, తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను ఆకర్షించేవారు. ఈ క్రమంలో బాధితులను మదనపల్లికి రప్పించి, నకిలీ బంగారు దండను అసలు బంగారంగా చూపించారు. అనంతరం హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.131/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో టయోటా ఇన్నోవా కారుతో ప్రయాణిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 2.8 కిలోల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, టయోటా ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ముఠాపై గతంలో కూడా రెండు కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందని, కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. నకిలీ బంగారం పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పావని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇలాంటి మోసాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >