Posted on 2026-06-05 17:57:15
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
టేకులపల్లి మండలం నుండి సుజాతనగర్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును (నెంబర్: TG29T1053) సుజాతనగర్ పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, పశువులను అత్యంత క్రూరంగా కట్టేసి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
రెండు ఆవు దూడలు, రెండు కోడి దూడలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును సీజ్ చేశారు.
బత్తుల శ్రీను, మాదాసు శ్రీను ,నిందితులు టేకులపల్లి ప్రాంతంలో మధ్యవర్తి సేవ్య సహాయంతో పశువులను తక్కువ ధరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, కోదాడ సంతలో ఎక్కువ ధరకు విక్రయించడానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >