Posted on 2026-06-05 17:23:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నగర్ లోని కార్మికులకు మద్యపాన వ్యసన నిర్మూలనపై ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కౌన్సెలింగ్ నిర్వహించి కార్మికులకు మద్యపాన వ్యసనం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యపానం తాత్కాలిక ఆనందాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలంలో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు ఆర్థిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
మద్యపాన వ్యసనం కారణంగా ఆరోగ్య సమస్యలు, కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, నరాల బలహీనతలు, మానసిక ఆందోళనలు, కుటుంబ కలహాలు మరియు ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా కార్మికులు మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ సంక్షేమానికి కూడా తోడ్పడగలరని చెప్పారు.
మద్యపాన వ్యసనం ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ అని తెలుపుతూ, దీనికి సరైన చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిగా విముక్తి పొందవచ్చని వివరించారు.
మద్యపానం మానేందుకు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మద్యపానం మాన లేము, చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు వంటి అపోహలను విడిచిపెట్టి, వ్యసనం నుండి బయటపడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మద్యపాన వ్యసన విముక్తి పొందాలని అనుకునేవారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత కార్మికులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
Posted On 2026-06-05 18:30:49
Readmore >
మద్యపాన వ్యసనం నుండి కార్మికులు విముక్తి పొందాలి : ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-06-05 17:23:03
Readmore >
డివైడర్ మధ్యలో మొక్కలు నాటాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-05 17:14:37
Readmore >
మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-05 14:40:07
Readmore >
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >