| Daily భారత్
Logo




ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు

News

Posted on 2026-06-04 15:52:23

Share: Share


ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా :  మద్దిశెట్టి సామేలు

మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి NYC కోర్ కమిటీ మరియు రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని గంగాపుత్ర ఫంక్షన్ హాల్ నందు మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి NYC కోర్ కమిటీ మరియు రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ మద్దిశెట్టి సామేలుహాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామపంచాయతీలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.

పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలను తమ ప్రధాన అజెండాగా తీసుకోవాలని, ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య వారధిలా పనిచేయాలని అన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులను కలుస్తూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.

రాజకీయ పదవులు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా శివశక్తి పూజారి అంశంపై కూడా మద్దిశెట్టి సామేలు స్పందించారు. ఈ విషయమై గతంలో భారత రాష్ట్రపతి కార్యాలయానికి, జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీకి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఆ వినతులపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం మరియు జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధిత ఎండోమెంట్స్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.

పార్టీ జాతీయ నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో పార్టీ నిర్మాణం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన రాజులపాటి ఐలయ్య, కొనక రామదాసు, బీరు సామేలు, పూనె వెంకన్న, దానసరి సారమ్మ, పూనె సూరయ్య తదితర నాయకులను మద్దిశెట్టి సామేలు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలగాని శ్రీనివాస్ గౌడ్, ఇల్లందు నాయకులు కిన్నెర రామకృష్ణ మరియు మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, యువజన నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని మరింత విస్తరించి ప్రజల మధ్య బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి సామేలు తెలిపారు.

Image 1

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్..

Posted On 2026-06-04 16:10:32

Readmore >
Image 1

హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం..

Posted On 2026-06-04 16:02:10

Readmore >
Image 1

కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం

Posted On 2026-06-04 15:58:25

Readmore >
Image 1

ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు

Posted On 2026-06-04 15:52:23

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-04 12:50:14

Readmore >
Image 1

రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి... డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు!

Posted On 2026-06-04 12:18:53

Readmore >
Image 1

సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-06-04 12:14:22

Readmore >
Image 1

MGM ఆస్పత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి..

Posted On 2026-06-03 22:16:36

Readmore >
Image 1

ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్

Posted On 2026-06-03 22:09:33

Readmore >
Image 1

కరీంనగర్ : నంబర్ ప్లేట్ లేని 120 వాహనాల సీజ్

Posted On 2026-06-03 21:58:52

Readmore >