| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలీ...బిజెపి పార్టీ డిమాండ్

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలీ...బిజెపి పార్టీ డిమాండ్

కాంగ్రెస్ కి ఓటు వేసిన పాపానికి ప్రజలు చీకట్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది

దమ్మపేట విద్యుత్ శాఖలో సిబ్బందిని పెంచాలి 

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో విద్యుత్ శాఖ కార్యాలయంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మేమ్రండం ఇవ్వడం జరిగినది,నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ నిరంతర విద్యుత్తు అంతరాయం వల్ల సామాన్య ప్రజలకి,వ్యాపారస్తులకి, చంటి పిల్లలకు,వృద్ధులకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకున్నందుకు ప్రజలు ఇ రోజు చీకట్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రోజుకి చాలాసార్లు కరెంటు తీస్తున్నారు,కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని, వర్షాకాలం రాకముందే కరెంట్ కోతలతో ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నారు...ప్రస్తుతం కరెంట్ విషయంలో ప్రజలలో గందరగోళం నెలకొంది,వెంటనే పై స్థాయి అధికారులు స్పందించి విద్యుత్ సిబ్బంది కొరత లేకుండా చూడాలని,కరెంటు అంతరాయం లేకుండా చేయాలని,ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరూకునేది లేదు పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగినది,

ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు ఉడతనేనీ విశ్వేశ్వర రావు ,దారా మధుసూదన్ రావు,తదితరులు పాల్గొన్నారు.

Previous ఘోర అగ్నిప్రమాదం... విదేశీయులతో సహా పలువురు సజీవదహనం
Next మగ్గం మాట్లాడుతోంది..!
ADVERTISEMENT