డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు , పోలీస్ అధికారులకు,సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు,ఏ.ఓ పద్మ,సి.ఐ శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్,రవీందర్,మొగిలి,రవి, ఆర్.ఐ లు మధుకర్, సురేష్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.