Posted on 2026-05-24 04:15:55
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గోవుల అక్రమ రవాణా యదేచ్చగా జరుగుతుందనీ, దేశంలో గోవధ నిషేధ చట్టాలు ఉన్నా అవి అమలు చేయడం లో ప్రభుత్వం విఫమయ్యిందనీ, కనుక 1977 వ సంవత్సరం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొహిబీషన్ ఆప్ కౌ స్లాటర్ అండ్ ఆనిమల్ ప్రిజర్వేషన్ Act 1977 ను అమలులోకి తెచ్చినా, రాజ్యాంగం లోని ఆర్టికల్ 48 కూడా గోరక్షణకు సంబంధించినదే అయినా కానీ భద్రాద్రి జిల్లా నుండి గో సంతతి అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతూనే ఉందనీ, ఇంకా బక్రీదు పండుగ సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గోవుల అక్రమ రవాణా, అక్రమ గో వధ రెట్టింపు స్ధాయి లో జరుగుతుందనీ, కావునా హిందువులు పరమ పవిత్రంగా పూజించే, సకల దేవతా నిలయంగా భావించే, పర్యావరణ సమతుల్యానికి దోహద పడే గోసంతతి ని అక్రమ రవాణా చేయకుండా, అక్రమంగా వధించకుండా రక్షించే విధంగా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయవలసిందిగా, అక్రమంగా నిర్వహిస్తున్న కభేళాలను మూసివేయవలసిందిగా విశ్వహిందూ పరిషత్ కోరుతూ పాల్వంచ DSP గారికి, CI గారికి, పాల్వంచ పట్టణ SI గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధరి సీత, పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్, పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు, ప్రఖండ ఉపాధ్యక్షులు చల్లా లింగన్న గారు, ప్రఖండ సహ కార్యదర్శి వేములపల్లి ప్రవీణ్ గారు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >