Posted on 2026-05-23 16:23:13
యువత రక్త దానానికి ముందుకు రావాలి
తల సేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిరిసిల్ల రోడ్ గల ఆదిత్య వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిలు తెలియజేశారు. వేసవి కాలం కావడంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసమే ఈ రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామని ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు మొదటగా రక్తదానం చేసే 120 మంది రక్తదాతలకు హెల్మెట్లను ఆ తరువాత రక్తదాతలకు ప్రశంసా పత్రాలను కీ చైన్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎర్రం చంద్రశేఖర్,జమీల్ అహ్మద్,డాక్టర్ వేద ప్రకాష్,పర్ష వెంకటరమణ,డాక్టర్ పుట్ల అనిల్,జలిగామ శ్రీకాంత్,దొంతి సుధాకర్,కస్వ వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >