Posted on 2026-05-23 19:53:13
యువత రక్త దానానికి ముందుకు రావాలి
తల సేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిరిసిల్ల రోడ్ గల ఆదిత్య వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిలు తెలియజేశారు. వేసవి కాలం కావడంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసమే ఈ రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామని ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు మొదటగా రక్తదానం చేసే 120 మంది రక్తదాతలకు హెల్మెట్లను ఆ తరువాత రక్తదాతలకు ప్రశంసా పత్రాలను కీ చైన్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎర్రం చంద్రశేఖర్,జమీల్ అహ్మద్,డాక్టర్ వేద ప్రకాష్,పర్ష వెంకటరమణ,డాక్టర్ పుట్ల అనిల్,జలిగామ శ్రీకాంత్,దొంతి సుధాకర్,కస్వ వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాట్రన్ మెంబర్గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి
Posted On 2026-05-23 19:54:28
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా లింగంపేట్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-05-23 19:51:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
Posted On 2026-05-23 17:47:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కోళ్ల ఫారమ్ దగ్ధం..
Posted On 2026-05-22 20:06:53
Readmore >
గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-22 19:31:49
Readmore >