Posted on 2026-05-23 16:23:13
యువత రక్త దానానికి ముందుకు రావాలి
తల సేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిరిసిల్ల రోడ్ గల ఆదిత్య వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిలు తెలియజేశారు. వేసవి కాలం కావడంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసమే ఈ రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామని ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు మొదటగా రక్తదానం చేసే 120 మంది రక్తదాతలకు హెల్మెట్లను ఆ తరువాత రక్తదాతలకు ప్రశంసా పత్రాలను కీ చైన్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎర్రం చంద్రశేఖర్,జమీల్ అహ్మద్,డాక్టర్ వేద ప్రకాష్,పర్ష వెంకటరమణ,డాక్టర్ పుట్ల అనిల్,జలిగామ శ్రీకాంత్,దొంతి సుధాకర్,కస్వ వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >