| Daily భారత్
Logo




ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్

News

Posted on 2026-05-19 19:50:14

Share: Share


ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్

2026లో సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ జాతీయ రైల్వే ప్రాజెక్ట్ అయిన ఎతిహాద్ రైల్, ఫుజైరాలో తన తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఏడాది చివర్లో దశలవారీగా ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ స్టేషన్‌ను సిద్ధం చేశారు.

ఫుజైరాలోని మదీనత్ అల్ హిలాల్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టేషన్ 51,900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఎతిహాద్ రైల్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధ్రా అల్ మన్సూరి మాట్లాడుతూ, ఈ స్టేషన్ ఫుజైరాలోని ప్రధాన పర్యాటక, వాణిజ్య ప్రాంతాలకు సమీపంలో వ్యూహాత్మకంగా నిర్మించబడిందని తెలిపారు.

ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 12 నిమిషాల దూరంలో, అంబ్రెల్లా బీచ్ కార్నిష్‌కు 6 నిమిషాలు, సకమ్‌కమ్ కోటకు 5 నిమిషాల దూరంలో ఈ స్టేషన్ ఉందన్నారు.

ఈ రైల్వే సేవల ద్వారా ఫుజైరా, దుబాయ్, అబుదాబి నగరాల మధ్య రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని, పలు రంగాల్లో పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఫుజైరా నుంచి అబుదాబికి ప్రయాణ సమయం కేవలం 105 నిమిషాలకే పరిమితం కానుంది.

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైళ్లలో ఒకేసారి 400 మంది ప్రయాణికులు ప్రయాణించగలుగుతారు. జాతీయ రైల్వే నెట్‌వర్క్ నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రిలో 70 శాతం దేశీయంగా 97 స్థానిక సరఫరాదారుల నుంచి సేకరించినట్లు అధికారులు తెలిపారు.

మొదటి దశలో అబుదాబి, దుబాయ్, ఫుజైరాలను అనుసంధానించే మూడు ప్రధాన మార్గాలను ఒకేసారి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైళ్ల సమయ పట్టికలను సేవలు ప్రారంభానికి సమీపంలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఎతిహాద్ రైల్ తెలిపింది. స్టేషన్‌లో రిటైల్ షాపులు, వీఐపీ లౌంజ్, హైస్పీడ్ వైఫై, ప్రత్యేక డైనింగ్ కారేజీలు, ఆటోమేటెడ్ టికెట్ చెల్లింపు యంత్రాలు, విశ్రాంతి ప్రాంతాలు, ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ ఆధునిక సదుపాయాలతో యూఏఈలో రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మార్చడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.


#Fujairah #UAE #Etihad Rail

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >