Posted on 2026-05-12 19:20:10
అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీస్ వారు అన్నపురెడ్డిపల్లి గ్రామ శివారులో ఆవులు మరియు దూడలను అక్రమంగా రవాణా చేస్తూ కబేళాలకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినారు. అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులు ములకలపల్లి మండల పరిసర గ్రామాలలో రైతుల వద్ద నుండి 4 ఆవులు, 7 దూడలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, సూర్యాపేట సంత ద్వారా హైదరాబాద్లోని కబేళాలకు సంబంధించిన వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించేందుకు అశోక్ లేలాండ్ మినీ ట్రక్లో తరలిస్తుండగా, అన్నపురెడ్డిపల్లి గ్రామ శివారులో అన్నపురెడ్డిపల్లి పోలీసులు వారిని మరియు వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు. వ్యక్తులపై బైండోవర్ చేయడం జరిగినది.
పశువుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బైండోవర్ చేయడం జరుగుతుందని ప్రజలకు హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి మరియు ఏఎస్ఐ పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >