Posted on 2026-05-12 15:41:46
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కార్మిక ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ పర్సన్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గర్భిణులను సకాలంలో గుర్తించి వారికి క్రమ తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులను గుర్తించి, వారిలో రక్తహీనత లోపించకుండా ఐరన్ మాత్రలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలని ఆశా నోడల్ పర్సన్లకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, సీహెచ్ఓ శాంత, డీడీఎం కార్తీక్, డెమో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >