| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

News

Posted on 2026-05-12 19:10:28

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

పద్మావతి ఆసుపత్రి వైద్యుల ఘనత...

14 రోజుల పోరాటం తర్వాత క్షేమంగా డిశ్చార్జ్...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నెలలు నిండకముందే అత్యంత తక్కువ బరువుతో జన్మించిన ఓ పసికందును వేములవాడలోని పద్మావతి తల్లి, పిల్లల ఆసుపత్రి వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించారు. నల్గొండ జిల్లాకు చెందిన లింగంపల్లి పుష్పలత–భరత్ దంపతులు గర్భధారణ సమయంలో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఎనిమిదో నెల పూర్తికాకముందే పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని పర్యవేక్షణలో ఆమెకు సాధారణ ప్రసవం జరగ్గా కేవలం 1.4 కేజీల బరువుతో మగ శిశువు జన్మించాడు. శిశువు ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండటంతో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో వెంటనే ఎన్‌ఐసీయూ విభాగంలో చేర్చి చికిత్స ప్రారంభించారు. ఊపిరితిత్తుల సమస్య జాండిస్, సెప్సిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న శిశువుకు నాలుగు రోజుల పాటు నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తూ ప్రత్యేక వైద్యం అందించారు. వైద్యుల నిరంతర కృషి, పర్యవేక్షణతో 14 రోజుల తర్వాత బాబు పూర్తి ఆరోగ్యవంతుడు కావడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ ప్రీమెచ్యూర్ శిశువులకు సర్ఫాక్టెంట్, సీపాప్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడ పరిసర ప్రాంతాల్లోనే అత్యాధునిక ఎన్‌ఐసీయూ సౌకర్యం ఉండటం వల్ల అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడగలుగుతున్నామని ఆసుపత్రి నిర్వాహకులు రాజేష్ తెలిపారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి బాబు తండ్రి భరత్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >