| Daily భారత్
Logo




సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

News

Posted on 2026-05-12 19:01:13

Share: Share


సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు

మీ "లైకుల" సరదా.. పోలీసుల "సమయం" వృథా: ఆత్మహత్య డ్రామా వీడియోలు తీసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలతో ఆడుకోకండి!

సోషల్ మీడియా మోజు వద్దు – కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు పునాది వేయండి

జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్  

డైలీ భారత్, కామారెడ్డి:సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ మరియు లైక్స్ కోసం “ఆత్మహత్య చేసుకుంటున్నాను” అన్నట్లుగా వీడియో రూపొందించి పోస్ట్ చేసిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలలోకి వెళ్తే,.. 

రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో రూపొందించి పోస్ట్ చేయడంతో, విషయం గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ మరియు లైక్స్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ వీడియో రూపొందించినట్లు రోహిత్ తెలుపడం జరిగింది.

ఈ ఘటన కారణంగా పోలీసులు అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే స్పందించాల్సి రావడం వల్ల విలువైన పోలీసు సమయం మరియు వనరులు వృథా అయినట్లు కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పి  మాట్లాడుతూ, 

సోషల్ మీడియాలో కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ "ఆత్మహత్య డ్రామాలు" చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. మీ ఒక్క తప్పుడు పోస్ట్ వల్ల పోలీస్ యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి.. పోలీసుల విలువైన సమయం మరొకరి ప్రాణాన్ని కాపాడటానికో లేదా ఆపదలో ఉన్న బాధితులకు సాయం చేయడానికో ఉపయోగపడాలి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల పోలీసుల సమయం వృథా అయితే, నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సాయం అందడంలో ఆలస్యం జరగొచ్చు.

 యువత రీల్స్, సోషల్ మీడియా మోజులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కష్టపడి చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పీ  సూచించారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టేలా ముందుకు సాగాలని, క్షణికమైన గుర్తింపు కోసం తప్పుదారులు పట్టవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసుల సమయాన్ని వృథా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి స్పష్టం చేశారు.

Image 1

పేకాట స్థావరంపై పోలీస్ మెరుపు దాడి..

Posted On 2026-05-12 19:44:50

Readmore >
Image 1

షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన

Posted On 2026-05-12 19:30:43

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Posted On 2026-05-12 19:21:38

Readmore >
Image 1

పశువుల అక్రమ రవాణా దారుల అరెస్ట్

Posted On 2026-05-12 19:20:10

Readmore >
Image 1

నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు

Posted On 2026-05-12 19:17:14

Readmore >
Image 1

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

Posted On 2026-05-12 19:11:46

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

Posted On 2026-05-12 19:10:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

Posted On 2026-05-12 19:01:13

Readmore >
Image 1

లలిత్ కంగన్ హాల్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Posted On 2026-05-12 18:58:21

Readmore >
Image 1

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

Posted On 2026-05-12 16:38:01

Readmore >