డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్ బస్తి లో ఆదివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించి హిందూ సమ్మేళన సమితి - కల్కి నగర్ బస్తి నీ ఏర్పాటు చేయడం జరిగినది. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులుగా ఆమెటి రమేష్ ని, ప్రధాన కార్యదర్శిగా పోతరాజు వెంకటేష్ ని, కోశాధికారిగా సిద్ధంశెట్టి పవన్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కల్కి నగర్ బస్తివాసులు పాల్గొనడం జరిగినది. హిందూ సమ్మేళన సమితిలో హిందువుల ఐక్యమత్యంతోపాటు హిందూ బంధువులందరూ కలిసికట్టుగా హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.