Posted on 2026-03-26 14:37:36
డైలీ భారత్, కామారెడ్డి: రాజంపేట మండలం తలమడ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ వారు సుమారు రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ మరియు ఇతర సామగ్రిని విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఈ సహాయం అందింది.
ఈ సందర్భంగా గ్రూప్ మేనేజ్మెంట్ తరఫున జీఎం సుధాకర్ రెడ్డి చొరవతో 24 డ్యూయల్ డెస్క్లు, 5 క్లాస్రూమ్ టేబుల్స్, ఒక కంప్యూటర్, ప్రింటర్ (స్కానర్, జీరోక్స్ సదుపాయంతో), ఒక ఆర్ఓ వాటర్ ఫిల్టర్, 10 ఆఫీస్ కుర్చీలు పాఠశాలకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి, మేనేజర్లు ఒబ్లేష్, శివకుమార్, శ్రీనివాస్లకు గ్రామస్థుల తరఫున, పాఠశాలల తరఫున సన్మానం నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణాల లక్ష్మి జగదీష్, ఉపసర్పంచ్ నర్మల వెంకట్, మండల విద్యాధికారి పూర్ణచందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.అనంతరం సర్పంచ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండల విద్యాధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >