Posted on 2026-03-26 13:37:36
డైలీ భారత్, కామారెడ్డి: రాజంపేట మండలం తలమడ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ వారు సుమారు రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ మరియు ఇతర సామగ్రిని విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఈ సహాయం అందింది.
ఈ సందర్భంగా గ్రూప్ మేనేజ్మెంట్ తరఫున జీఎం సుధాకర్ రెడ్డి చొరవతో 24 డ్యూయల్ డెస్క్లు, 5 క్లాస్రూమ్ టేబుల్స్, ఒక కంప్యూటర్, ప్రింటర్ (స్కానర్, జీరోక్స్ సదుపాయంతో), ఒక ఆర్ఓ వాటర్ ఫిల్టర్, 10 ఆఫీస్ కుర్చీలు పాఠశాలకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి, మేనేజర్లు ఒబ్లేష్, శివకుమార్, శ్రీనివాస్లకు గ్రామస్థుల తరఫున, పాఠశాలల తరఫున సన్మానం నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణాల లక్ష్మి జగదీష్, ఉపసర్పంచ్ నర్మల వెంకట్, మండల విద్యాధికారి పూర్ణచందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.అనంతరం సర్పంచ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండల విద్యాధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
Posted On 2026-03-26 13:40:11
Readmore >
తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం
Posted On 2026-03-26 13:37:36
Readmore >
సీఎంఆర్ఎఫ్ ఎల్టీసీ మంజూరుపత్రాన్ని అందజేస్తున్న వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
Posted On 2026-03-26 02:47:09
Readmore >
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-26 02:45:25
Readmore >