Posted on 2026-03-26 13:31:44
డైలీ భారత్, మామడ: చీటింగ్ కేసు విషయంలో రూ. 40,000 లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ లో గురువారం చోటుచేసుకుంది. అదిలాబాద్ ఏసీబీ డి.ఎస్.పి జి మధు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మామడ ఎస్సెగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. అనంతరం భేరసారాలు తర్వాత రూ.20,000 ఒప్పందం కుదుర్చుకున్నాడని, దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పన్నిన పథకం ప్రకారం సదరు బాధితుడు లంచం ఇస్తుండగా ఎస్సెని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఈ ఎస్ఐ పై అనేక అవినీతి ఆరోపణాలు ఉన్నాయని ఉన్నతాధికారులు ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >