Posted on 2026-03-26 12:31:44
డైలీ భారత్, మామడ: చీటింగ్ కేసు విషయంలో రూ. 40,000 లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ లో గురువారం చోటుచేసుకుంది. అదిలాబాద్ ఏసీబీ డి.ఎస్.పి జి మధు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మామడ ఎస్సెగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. అనంతరం భేరసారాలు తర్వాత రూ.20,000 ఒప్పందం కుదుర్చుకున్నాడని, దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పన్నిన పథకం ప్రకారం సదరు బాధితుడు లంచం ఇస్తుండగా ఎస్సెని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఈ ఎస్ఐ పై అనేక అవినీతి ఆరోపణాలు ఉన్నాయని ఉన్నతాధికారులు ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
Posted On 2026-03-26 13:40:11
Readmore >
తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం
Posted On 2026-03-26 13:37:36
Readmore >
సీఎంఆర్ఎఫ్ ఎల్టీసీ మంజూరుపత్రాన్ని అందజేస్తున్న వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
Posted On 2026-03-26 02:47:09
Readmore >
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-26 02:45:25
Readmore >