Posted on 2026-03-26 18:01:44
డైలీ భారత్, మామడ: చీటింగ్ కేసు విషయంలో రూ. 40,000 లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ లో గురువారం చోటుచేసుకుంది. అదిలాబాద్ ఏసీబీ డి.ఎస్.పి జి మధు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మామడ ఎస్సెగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. అనంతరం భేరసారాలు తర్వాత రూ.20,000 ఒప్పందం కుదుర్చుకున్నాడని, దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పన్నిన పథకం ప్రకారం సదరు బాధితుడు లంచం ఇస్తుండగా ఎస్సెని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఈ ఎస్ఐ పై అనేక అవినీతి ఆరోపణాలు ఉన్నాయని ఉన్నతాధికారులు ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >