Posted on 2026-03-23 22:50:17
డైలీ భారత్, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సోమవారం నాడు లోక్ భవన్ లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న పోలీసు జట్ల వివరాలను డిజిపి గవర్నర్కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాల పోలీసు బృందాల గౌరవ వందన స్వీకరణ, క్రీడాకారుల మార్చ్ పాస్ట్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. గవర్నర్ ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించనుండగా, ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర భద్రతా బలగాల నుంచి అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ వేదిక సిద్ధమైంది. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ పోటీలు దోహదపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, స్పోర్ట్స్ ఐజీపీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >