Posted on 2026-03-23 20:55:16
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో నెలకొన్న ప్రస్తుత ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులు బయోమెట్రిక్ నమోదు మరియు ఫోటో తీసుకునే ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, ఎస్సారెస్పీ (SRSP) నీటి విడుదలను వేగవంతం చేసి, రైతుల పంటలకు సమయానుకూలంగా నీరు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు., తన మంత్రిత్వ కాలంలో మంజూరు చేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు మరియు సంబంధిత వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు.జిల్లాలో ఉన్న భూ సమస్యలపై కూడా దృష్టి సారించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల పేర్లకు భూములు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మన్యు ప్యాట్నీ, నెహ్రు నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, బాధే నాగయ్య, భద్రు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >