Posted on 2026-03-23 15:25:16
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో నెలకొన్న ప్రస్తుత ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులు బయోమెట్రిక్ నమోదు మరియు ఫోటో తీసుకునే ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, ఎస్సారెస్పీ (SRSP) నీటి విడుదలను వేగవంతం చేసి, రైతుల పంటలకు సమయానుకూలంగా నీరు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు., తన మంత్రిత్వ కాలంలో మంజూరు చేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు మరియు సంబంధిత వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు.జిల్లాలో ఉన్న భూ సమస్యలపై కూడా దృష్టి సారించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల పేర్లకు భూములు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మన్యు ప్యాట్నీ, నెహ్రు నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, బాధే నాగయ్య, భద్రు తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >