| Daily భారత్
Logo




భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన భార్య, ఆమె సహచరుడు అరెస్ట్

News

Posted on 2026-03-23 20:10:18

Share: Share


భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన భార్య, ఆమె సహచరుడు అరెస్ట్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిప్పనపల్లి గ్రామం, డి.వి. నగర్ కాలనీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన జాఫర్ కేసులో పోలీసులు కీలక మలుపు తిప్పారు. మొదట ఈ కేసు అనుమానాస్పద మృతిగా నమోదు చేయబడగా, దర్యాప్తు, వైద్యుల అభిప్రాయం, సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల ఆధారంగా ఇది హత్య కేసుగా తేలింది. ఈ కేసులో మృతుడి భార్య ఎస్.డి. ఖతీజా మరియు ఆమెతో అక్రమ సంబంధం కలిగిన షేక్ మీరా సాహెబ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం, ఖతీజా తన భర్త జాఫర్‌తో తరచూ కుటుంబ కలహాలు పడుతూ ఉండేది. ఆమెకు ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన షేక్ మీరా సాహెబ్‌తో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధంగా మారింది. తమ సంబంధానికి జాఫర్ అడ్డుగా ఉన్నాడని భావించి,రాత్రి సమయంలో ఇద్దరూ కలసి జాఫర్‌పై దాడి చేసి, దిండు ముఖంపై అదిమిపట్టి, శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. అనంతరం సహజ మరణంలా నమ్మించి ఖననం చేయించినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో,  ఆధారంగా నేరానికి ఉపయోగించిన AP 37 CT 2050 Bajaj CT100 మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు, అలాగే మృతుడిని ఊపిరాడకుండా చేయడానికి ఉపయోగించిన దిండు మరియు చిన్నారిని బెదిరించడానికి ఉపయోగించిన చాకులను పోలీసులు పంచుల సమక్షంలో స్వాధీనం పరుచుకున్నారు.

ఈ కేసులో  నమోదు చేసిన సెక్షన్లను, పోస్టుమార్టం వైద్యాభిప్రాయం మరియు సేకరించిన ఆధారాల మేరకు మార్చి, నిందితులపై హత్య తదితర సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకొని న్యాయస్థానంలో హాజరు పరచుటకు చర్యలు చేపట్టినారు. ఈ కార్యక్రమంలో  జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీలక్ష్మి,  చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ  సిబ్బంది ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినారు

Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >