Posted on 2026-03-23 19:47:05
డైలీ భారత్, సిరిసిల్ల: తేది 23-03-2026 రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచిఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చిందని. కోర్టు అధికారిక ఈ-మెయిల్కు పంపిన సందేశంలో దుండగులు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు, అది పేల్చివేస్తామని హెచ్చరించినట్లు ఉండగా సంఘటనా స్థలానికి చేరుకుని కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని తదుపరి చర్యగా డాగ్ స్క్వాడ్ మరియు బాంబు డిస్పోజల్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు గదులు, పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో గంటల తరబడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని తెలిపారు. తనిఖీలలో బాంబు కి సంబందించిన ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ కన్పించలేదు. తదుపరి ఇదే విషయంలో కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ N.సత్యనారాయణ మూర్తి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంబించినట్లుగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ N. శ్రీనివాస్ తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >