డైలీ భారత్, ఖమ్మం జిల్లా:ఓ యువకుడు ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టిఆర్ జిల్లా విస్సన్నపేటలోఆదివారం సాయంత్రం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్టిఆర్ జిల్లాకు చెందిన నందు అనే యువకుడు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్జెండర్ కు సోషల్ మీడియాలో పరిచయ మయ్యాడు.
ఇన్స్టాగ్రామ్ వేధికగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ట్రాన్స్జెండర్ సంఘం సభ్యులకు తెలపడంతో ఆ జంటకు ఏన్కూరులోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయలంలో వివాహం జరిపించారు.