Posted on 2026-02-06 16:59:13
డైలీ భారత్, దమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సమాజాల్లో జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు
ఈ సందర్భంగా షీ టీం జిల్లా ఇన్చార్జి ప్రమీల మాట్లాడుతూ...
మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లాలో విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు తెలుపాలి మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేరుగా 8712656425 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గంభీరావుపేట మండలంలోని ఎంపీపీ ఎస్ సముద్ర లింగాపూర్ జెడ్పిహెచ్ఎస్ సముద్రాళింగాపూర్ ఎంపీపీ ఎస్ నాగంపేట జెడ్పిహెచ్ఎస్ నాగంపేట ఎంపీపీ ఎస్ మల్లు పల్లి ఎంపీపీ ఎస్ దమ్మన్నపేట ఎంపీపీ ఎస్ కుర్దులింగంపల్లి ఎంపీపీ ఎస్ ముస్తఫా నగర్ పాఠశాలలు కూడా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రమీల తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో షీ టీం సభ్యులు వీరయ్య శ్రీనివాస్ ప్రియాంక శ్రీలతలు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >