Posted on 2026-01-11 16:19:15
అధికారంలో ఉన్నప్పుడు మనమేం చేశామనేది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు,కానీ అధికారంలో ఉన్నప్పుడు మనమేం చేశామనేది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్డిరేషన్ మాజీ మేయర్ లతా ప్రేమ్ గౌడ్, ఆమె భర్త హస్తం పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆదివారం శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇవాళ ప్రజలు మన మాజీ సీఎం కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు కారణం అని అన్నారు.రేవంత్ రెడ్డి ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్నీ అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని అన్నారు.రేవంత్ రెడ్డి రైతులను, రైతు కూలీలను, కౌలుదారులను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరినీ మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని అన్నారు.పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మని చెప్పుకుంటూ, స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటున్నారని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని అన్నారు. రాజేంద్రనగర్కు వచ్చే ఏర్పాటు చేసిన మెట్రో ఎక్స్ప్రెస్ను రద్దు చేసినందుకు సీఎంతో కలిసి పోయిండా అనే విషయం చెప్పాలని కేటీఆర్ అన్నారు.
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >
వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ
Posted On 2026-07-30 12:57:14
Readmore >
సిరిసిల్ల పెద్ద బజార్లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >