Posted on 2026-01-11 20:34:46
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఇందల్వాయి మండలం లోని జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో 2011-12 విద్యా సంవత్సరానికి పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం తో పాటు తమకువిద్యనుబోధించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు.పూర్వ విద్యార్థులు ఆటపాటలలో తమ ప్రతిభ కనబరచి పండగ వాతావరణాన్ని తలపించారు.వివిధ రకాల ఆటల్ని ఉపాధ్యాయులతో ఆడించారు. గత 13 సంత్సరాల క్రితం పంచుకున్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానం లో ఉన్నందుకు ఉపాధ్యా యులు గర్వపడుతూ, ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ తమ పాఠశాల లో చదివిన విద్యార్థులు గొప్ప స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. విద్య నేర్పిన గురువులతో ఆట పాటలతో గడిపే అవకాశం మళ్ళీ వచ్చినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తు కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఆర్. రాధిక, టి. గంగాధర్, ప్రధానోపాధ్యాయులు బి. ఓంకారా చారి, వైస్ ప్రిన్సిపాల్ ఎం. ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బలవంత్ రావు, పాషా, పోశెట్టి, శంకర్, నరేష్, దుబ్బాక ప్రవీణ్, పాండు,భూమేష్, శ్రీధర్,రమాదేవి, అరుణ, తదితరులు, పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >