డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నాందేడ్ కు చెందిన షేక్ మహమ్మద్ కైఫ్, అద్నాన్ లను సీసీఎస్, మూడవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు డిసెంబర్ 29న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అమన్ పటేల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#nizamabad