Posted on 2026-01-07 18:00:29
డైలీ భారత్, సిరిసిల్ల:స్వచ్ఛ సర్వేక్షన్ 2025 లో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టే దిశగా వివిధ వాణిజ్య వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించబడినవి.
ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు, దుకాణదారులకు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను వివరించారు. పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిరిసిల్లను శుభ్రంగా నిలుపుకోవడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నివారించి, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వంటి పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని మున్సిపాలిటీ అధికారులు వ్యాపారులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#sircilla #rajanna sircilla
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >