Posted on 2026-01-05 15:14:59
డైలీ భారత్, హుజూర్ నగర్: రోడ్లపై ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆమె న్యాయవాదులు కోర్టు సిబ్బంది, పోలీసులతో కలిసి కోర్టు నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి వాహనాలు డ్రైవింగ్ చట్ట విరుద్ధమన్నారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన భద్రత సూచికలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలు నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడటం నేరమన్నారు. రోడ్డు నియమాలను ఉల్లంఘించిన వారు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం శిక్షకు అర్హులన్నారు.
వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ
Posted On 2026-07-30 12:57:14
Readmore >
సిరిసిల్ల పెద్ద బజార్లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >