Posted on 2025-12-03 15:34:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి పోలీస్ సిబ్బందితో సి పి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తూ ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ ను సిబ్బంది స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించేవిధంగా చూడాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్లు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులపై వివులంగా తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాన్యమైన ధర్యాప్తు చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ ధరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకము తీసుకోవాలని. అలానే రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ రిసిప్షనిస్టుకు సూచించారు. సైబర్ క్రైమ్ అవగాహణ పాఠశాలలు, కళాశాలలలో సోషల్ మీడియా ద్వారా అవగాహణ నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చేవిధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపర్చుకోవాలని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండేవిధంగా ఉండాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని, ద్విచక్రవాహణం నడిపే సమయంలో హెల్మేటు తప్పనిసరిగ్గా ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి ఎస్.ఐ జి. మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >