Posted on 2025-11-01 19:56:11
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని లయన్స్ జిల్లా రెండవ ఉప గవర్నర్ డి.నర్సింహరాజు ఉద్బోదించారు. ప్రపంచంలోనే సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ లు ముందున్నాయని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాదు రీజియన్ లోని లయన్స్ క్లబ్ లలో నూతనంగా చేరిన సభ్యులకు శనివారం నిజామాబాదు నగరంలోని కపిల హోటల్ కాన్పరెన్స్ హాల్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా రెండవ ఉప గవర్నర్ డి.నర్సింహరాజు ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ లు ముందుకు సాగుతున్నాయన్నారు..లయనిజంలో కొనసాగుతున్న వారు కొత్తగా చేరుతున్న వారు నిస్వార్దంగా సేవలందిస్తారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ లాంటి స్వచ్చంద సంస్థల్లో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. కొత్తగా లయనిజంలో చేరిన వారి వల్ల లయన్స్ సేవలు మరింత విసృతమవుతాయన్నారు..ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా జీఎస్టీ కో ఆర్డినేటర్ రాంమనోహర్, జీఎల్టీ కో ఆర్డినేటర్ టి.పద్మావతి, నిజామాబాదు రీజియన్ చైర్మెన్ సూర్యభగవాన్, కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, జిల్లా చైర్మెన్ డి.యాదగిరి, జోన్ చైర్మెన్ నర్సింహరావు, రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్, తదితరులు పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >