Posted on 2025-11-01 12:10:30
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన వివస్త్రగా గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నవీపేట్ ఎస్ఐ తిరుపతి వివరాలు సేకరిస్తున్నారు. తల, కుడిచేయి వేళ్లు లేకుండా మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >