Posted on 2025-10-28 11:40:09
కవిత – సీఎం రేవంత్ ప్రభుత్వం బిజినెస్ పార్ట్నర్లు
నిజామాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనూ బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. కవిత రాజీనామా ఆమోదం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కవిత రేవంత్ బిజినెస్ పార్ట్నర్ కాబట్టే రాజీనామా ఆమోదం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఆరు మున్సిపాలిటీలకు రూ.169.3 కోట్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఆ నిధులు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవెనని గుర్తు చేశారు. 80% రాష్ట్రం కేవలం 20% నిధులు మాత్రమే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తామే నిధులు తెచ్చామంటూ ప్రచారం చేయడం విడ్డూరం గా ఉందన్నారు. ఆర్వోబీ నిధుల కేటాయింపుపై దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు త్వరగా ఉన్నాయి మాధవ నగర్ ఆర్ఓబి వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్లో బీజేపీ పట్టు బలంగా ఉందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగా కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >