| Daily భారత్
Logo




ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

News

Posted on 2025-10-22 17:10:02

Share: Share


ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్, తాటితండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ   రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత  మహిళలకు పెద్దపీట వేస్తుందని, నిజామాబాద్ జిల్లాలో గత ధాన్యం కొనుగోలు  ఐకెపి ఆధ్వర్యంలో 100 సెంటర్ ఇస్తే, ప్రస్తుతం 200 ధాన్యం కొనుగోలు ఐకెపి కేంద్రాలకు అప్పజెప్పిందని అన్నారు. గత ధాన్యం కొనుగోలు ఐకెపి మహిళలకు కోటి రూపాయల  లాభం వచ్చిందని అన్నారు, 200 ఐకెపి సెంటర్ల వల్ల  ఐకెపి మహిళలకు సుమారు  రెండు కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. సిఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యానికి రసీదు కచ్చితంగా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎటువంటి అవకతవకలు జరగకూడదని  ఐకెపి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, చింతల కిషన్, లింగాపూర్ సంతోష్ రెడ్డి, రాయసింగ్, పరశురాం నాయక్, ఐకెపి సిబ్బంది, రైతులు తదితరులు   పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >
Image 1

ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

Posted On 2026-05-11 20:36:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణి లో 111 దరఖాస్తులు

Posted On 2026-05-11 20:35:56

Readmore >
Image 1

భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

Posted On 2026-05-11 19:52:59

Readmore >
Image 1

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-11 19:12:13

Readmore >