Posted on 2025-10-22 13:02:42
విద్యార్థినితో పరారైన వైనం - సిరిసిల్లలో చర్చనీయాంశం..!
డైలీ భారత్,రాజన్న సిరిసిల్లజిల్లా: విద్యా బుద్ధులు నేర్పిన గురువే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. సభ్య సమాజం.. చదువు సంస్కారం నేర్పించాల్సిన వాడే.. వక్ర మార్గం వైపు నడిపించాడు.. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు.. ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పని చేసే ఓ గురువు.. డిగ్రీ చదువుతున్న విద్యార్థినితో పరారైన ఉదంతం రాజన్న జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపాల్ నిర్వాకంపై సిరిసిల్ల ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తమ కళాశాలలో విద్యనభ్యసించే ఓ విద్యార్థినితో కొంతకాలంగా చనువుగా ఉంటూ వచ్చాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటుంది. గతంలో ఇంటర్ సమయంలోనే విద్యార్థినినీ ప్రలోభపరిచిన అధ్యాపకుడు ఈసారి ఏకంగా ఆమెతో కలిసి గత రెండు రోజుల క్రితం అదృష్టమైనట్టు సమాచారం. ప్రిన్సిపల్, విద్యార్థిని ఇద్దరూ కనిపించకుండా పోయిన ఘటన జిల్లా వ్యాప్తంతగా సంచలనం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.
భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు
Posted On 2026-05-11 19:52:59
Readmore >
విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-11 19:12:13
Readmore >
సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు..
Posted On 2026-05-11 18:35:23
Readmore >
"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"
Posted On 2026-05-11 18:26:59
Readmore >
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-11 16:03:11
Readmore >
బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య
Posted On 2026-05-11 16:01:16
Readmore >