| Daily భారత్
Logo




రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విషయంలో విచారణ చేపడతాం

News

Posted on 2025-10-21 19:47:29

Share: Share


రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విషయంలో  విచారణ చేపడతాం

ప్రమోద్ కుటుంబానికి సీఎం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా

డీజీపీ శివధర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:పోలీసు శాఖలో విధి నిర్వహణలో భాగంగా జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ తరపున సానుభూతి ప్రకటించారు. ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, వాటిని కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విచారణ జరుగుతుందన్నారు. విచారణ బాధ్యతలను పొరుగు జిల్లా అధికారికి అప్పగించినట్లు డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టులు నిర్భయంగా లొంగిపోవాలని కోరారు. పోలీసు, రెవెన్యూ, మీడియా ఆధ్వర్యంలోనూ వారు లొంగిపోయినా ప్రభుత్వం తరపున అందజేయాల్సిన రివార్డును అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దండకారణ్యంలో పని చేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు కమిషనర్ సాయిచైతన్యలు పాల్గొన్నారు.

Image 1

హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం

Posted On 2026-05-11 11:53:42

Readmore >
Image 1

బంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?

Posted On 2026-05-11 11:03:32

Readmore >
Image 1

ఫోన్ ఇవ్వలేదని తల్వార్ తో బంధువుపై దాడి

Posted On 2026-05-11 10:49:35

Readmore >
Image 1

రైతుల మక్కల కొనుగోళ్లలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

Posted On 2026-05-11 10:27:51

Readmore >
Image 1

ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

Posted On 2026-05-11 10:01:16

Readmore >
Image 1

నిశ్శబ్ద సేవకురాలు నర్సు ... మంజుల పత్తిపాటి

Posted On 2026-05-11 09:51:44

Readmore >
Image 1

విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు

Posted On 2026-05-11 07:23:20

Readmore >
Image 1

25 వ వార్డు కౌన్సిలర్ పెంటయ్యకు శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-05-11 07:22:27

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా

Posted On 2026-05-11 07:21:04

Readmore >
Image 1

తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”

Posted On 2026-05-11 07:20:06

Readmore >