Posted on 2025-10-21 12:05:27
డైలీ భారత్, మంచిర్యాల:మంచిర్యాల జిల్లా రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాగామ శ్రీశైలం (25) ఆలుగామ గ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు గల్లంతయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటపల్లి ఎస్ఐ రాజేందర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంలో మంగళవారం శ్రీశైలం నదిలో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
సహాయక చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ గారు అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఎస్ఐ రాజేందర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గట్టు లక్ష్మన్ గౌడ్ తదితరులు నది వద్దనే ఉండి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
గాలింపు చర్యల కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి ఒక బోటును తీసుకురావడంతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >