Posted on 2025-10-20 22:17:49
నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వఆసుపత్రిలో ఖైదీ వార్డులో (ఐసో లేషన్ వార్డు) లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ముందుగా హస్పీటల్ అద్దాలను ధ్వంసం చేశాడు.
సౌండ్ గమనించిన అదే సమయంలో రెగ్యూలర్ తనిఖీలలో బాగంగా ఎఆర్ పోలీసులు ప్రిజనరీ వార్డును తనిఖీ చేసేందుకు వచ్చారు. అప్పుడు అక్కడికి చేరుకున్న రిజర్వ్ సిబ్బంది రియాజ్ ను వారించారు. కాని వారిని పట్టించుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కున్నాడు. తుపాకిని పారేయాలని పోలీసులు చెబుతున్న వినకుండా తుపాకీ తో కాల్చేందుకు ( ట్రిగ్గర్ నొక్కేందుకు) ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏ ఆర్ ఎస్ ఐ ఆత్మ రక్షణార్థం జరిగిన కాల్పులలో రియాజ్ ఖతం అయ్యాడు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా జనరల్ ఆసుపత్రిలో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితులలోనే కాల్పులు జరపడం జరిగిందని అందులోనే రియాజ్ హతం అయ్యారని అన్నారు. రియాజ్ కిందపడి తిరిగి లేవ లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరుగుతుందని దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్ కు గల కారణాలు విచారణలో తేలుతాయని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అదనపు డిసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గోన్నారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >