Posted on 2025-10-07 15:10:49
అర్ధరాత్రి అయినా యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పోలీస్ బాస్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, సోమవారం అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నిజామాబాద్ లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్నటువంటి వారిని చెక్ వద్ద ఉన్న వస్తువులను తనిఖీ చేశారు. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్ లు నిర్వహించారు. రాత్రి సమయాలలో మళ్లీ తిరిగి నట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >