| Daily భారత్
Logo




ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-09-26 13:29:24

Share: Share


ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి

పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి

ఎల్లారెడ్డిపేట కళాశాలలో పీటీఎంకు హాజరైన కలెక్టర్

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పదో తరగతి ముగిసిన తర్వాత ఇంటర్మీడియట్ దశ కీలకమని స్పష్టం చేశారు. ఇంటర్ నుంచే ప్రతి సబ్జెక్టు పరిధి పెరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ తాము ఎంచుకున్న గ్రూప్ లకు సంబంధించి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాల లోని లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డాక్టర్, ఇంజనీర్ కాకుండా లాయర్, ఆర్కిటెక్, టీచర్, బిజినెస్ మ్యాన్ ఇతర రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రతి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ భవిష్యత్తు కోసం శ్రద్ధగా చదువుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంట్లో చదివించాలని తెలిపారు. తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలలు మరింత బలపడి పూర్వవైభవం వస్తుందని తెలిపారు.

కళాశాలలో గదులు ఇతర సమస్యలను తాను పరిష్కరి స్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రతిరోజు కళాశాలలో జరిగే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగా విని రాసుకొని వాటిని నిరంతరం సాధన చేయాలని తెలిపారు. అధ్యాపకులు అందరూ ఎప్పటికప్పుడు ముగుస్తున్న పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కలెక్టర్ సూచించగా, కళాశాలలో శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ , విద్యార్థులకు ఆర్టీసీ బస్ స్టాప్ సౌకర్యం, తదితర సమస్యలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

తరగతి గదుల్లో అవసరమైన డెస్క్ లను వెంటనే సమకూరుస్తామని, ఆన్ అకాడమీ కోసం అవసరమైన డిజిటల్ బోర్డులు త్వరలోనే వస్తాయని, శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని, త్వరలోనే నిర్మాణం చేపడుతామని కలెక్టర్ తెలిపారు. 

కళాశాలలో మైదానం, ఆవరణను కలెక్టర్ పరిశీలించారు. గడ్డి, పిచ్చిమొక్కలు శుభ్రం చేయించాలని ఎంపీడీఓ సత్తయ్యను ఆదేశించారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, తహసిల్దార్ సుజాత, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >